Category / బోధనలు

పిల్లలారా, సముద్రపు అలలను నిరోధించడానికి తీరమున్నది. ఆధ్యాత్మిక జీవితంలో, మనస్సు యొక్క అలలను నిరోధించేది వ్రతాచరణలే. ఏకాదశి, పౌర్ణమి మొదలైన దినాలలో వాతావరణం పూర్తిగా కలుషితమై ఉంటుంది. ఈ రోజులలో పండ్లు మాత్రమే భుజించి, మౌనవ్రతము ఆచరించటం మంచిది. పండ్లు తోలుతో కప్పబడి ఉండటం వలన వాతావరణ కాలుష్యం వాటిపై అంతగా ప్రభావం చూపదు. ఈ రోజులు సాధనకు ఎంతో అనుకూలమైనవి. అప్పుడు, మన ఆలోచనలేవైనా; ఆధ్యాత్మికము కానీ, భౌతికము కానీ, వాటిలో మరింత ఏకాగ్రతను పొందవచ్చు. […]

పిల్లలారా, గుర్రపుడెక్కతో మూసుకుపోయిన నీటిలో పడవ నడపటము ప్రయాసమే. గుర్రపుడెక్కను తొలగించినాక పడవ వేగంగా ముందుకు వెళ్తుంది. అదే విధంగా, మనోమాలిన్యాలను జపముతో తొలగించితే ధ్యానము వేగవంతమవుతుంది. ప్రాణాయమము సరిగా చేయకపోతే ఎంత ప్రమాదకరమో అలాంటిదే శ్రద్ధ లేకుండా నిరంతర జపము చేయటము. జపము చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వేరే ఆలోచనలను దూరంగా ఉంచాలి. రూపములోనో, మంత్రాక్షరములలోనో మనస్సుని ఏకాగ్రము చేయటానికి జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలారా, మంత్రము సదా జపించాలి. విశ్రమము లేకుండా జపించటము మనస్సుకు నేర్పించాలి. […]

మంత్రాలకు శక్తి లేనట్లైతే, అప్పుడు మాటలకు కూడా శక్తి లేదు. “బయటకు పో” అని కోపంగా చెప్పినదానికి, “దయచేసి బయటకు వెళ్ళండి” అని సౌమ్యంగా చెప్పినదానికి, విన్న వారిలో భిన్న ప్రతిస్పందనలు కలుగుతాయి కదా? మంత్రము జపించేది మన మనస్సును శుద్ధి చేయటానికి మాత్రమే. అంతే కానీ, మంత్రముతో భగవంతుని తృప్తిపరచేందుకు కాదు. భగవంతునికి మంత్రము ఎందుకు? మంత్రము జపిస్తే, అది మాత్రం చాలు. అర్థాన్ని గురించి ఆలోచించి తల బద్దలు చేసుకోవలసిన అవసరము లేదు. మీరు […]

ధ్యానమంటే ఏమిటో, ఎలా ఎక్కడ ధ్యానము చేయాలో, ఎలా ధ్యానము చేయకూడదో, జపము కూడా ధ్యానములో ఎలా ఒక భాగమో, అమ్మ, సద్గురువు శ్రీ మాతా అమృతానందమయి దేవి, వివరిస్తున్నారు.