5 ఏప్రిల్ 2011, కెన్యా
అమ్మ సన్నిధిలో, కెన్యా గణ తంత్ర రాజ్య ఉప రాష్ట్రపతి కలొంఝో మ్యుసియొక, “మాతా అమృతానందమయి మఠం – కెన్యా”చే నిర్మించబడిన నూతన బాలల గృహానికి ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ అతీ నది ఒడ్డున నిర్వహించిన ఒక బహిరంగ కార్యక్రమంలో, ఉప రాష్ట్రపతితో పాటు చాలా మంది అతిథులు పాలు పంచుకున్నారు: క్రీడల మరియు సంస్కృతి సహాయ మంత్రి శ్రీమతి వావిన్యా న్దెతి, అనేక మంది పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టరు, కెన్యా ప్రసిద్ధ గాయకుడు శ్రీ ఎరిక్ వైనైన. మొట్టమొదట ఈ బాలల గృహం 108 మంది బాలలకు ఆశ్రయమవుతుంది.

ఈ బాల గృహంతో పాటు మరో రెండు పథకాలకు ప్రారంభోత్సవం చేయబడింది – అమృత వృత్తి శిక్షణా కేంద్రం మరియు అమృత త్రాగు నీటి సరఫరా పథకం.

అమృత వృత్తి శిక్షణా కేంద్రం, 35 కంప్యూటర్లతో, దగ్గరలో ఉన్న జాం నగరంలోని వెనుకబడిన ప్రజానీకానికి సేవలు అందిస్తుంది. ఈ కేంద్రపు మొదటి కోర్సులో 50 మందికి ప్రాధమిక కంప్యూటరు శిక్షణ ఇవ్వడం జరిగింది.

అమృత త్రాగు నీటి సరఫరా పథకం ద్వారా ప్రతి రోజూ బాలల కేంద్రం చుట్టు ప్రక్కల ఉన్న, తీవ్రమైన కరువుకు గురైన మసాయి ఆదివాసి ప్రజలకు పరిశుభ్రమైన త్రాగు నీరు సరఫరా చేయబడుతుంది.


Download Amma App and stay connected to Amma